హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఇంట్లో విషాదం నెలకొంది. మధుయాష్కీ తల్లి అనసూయమ్మ సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. అనసూయమ్మ మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ సంతాపాన్ని ప్రకటించారు.
మధుయాష్కీతో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావుతో పాటు పలువురు నాయకులు మధుయాష్కీ గౌడ్ ఇంటికి వెళ్లి.. అనసూయమ్మ పార్థివదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా, అనసూయమ్మ పార్థివదేహానికి ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి, కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి నివాళులర్పించి పాడె మోశారు.