
యాంటీ కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న కొద్దిసేపటికే మహారాష్ట్రకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి మంగళవారం మరణించాడు. ఆ వ్యక్తిని భివాండికి చెందిన సుఖ్దేవ్ కిర్దత్గా గుర్తించారు. కిర్గత్ ఒక కంటి నిపుణుడి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కిర్గత్ మంగళవారం కరోనా వ్యాక్సిన్ సెంటర్లో రెండో డోసు తీసుకున్నాడు. ఆ తర్వాత 15 నిమిషాల పాటు అబ్జర్వేషన్ గదిలో ఉన్నాడు. ఆ సమయంలో కిర్దత్ స్పృహ కోల్పోయాడు. వెంటనే సమీపంలోని ఇందిరా గాంధీ స్మారక ఆసుపత్రికి తరలించారు. అక్కడ కిర్గత్ను పరిశీలించిన వైద్యులు.. చనిపోయాడని ధృవీకరించారు. కిర్దత్ తన మొదటి డోసు వ్యాక్సిన్ను జనవరి 28న తీసుకున్నాడు. ఆ సమయంలో ఎటువంటి సమస్య లేని కిర్దత్.. రెండో డోసు తీసుకోగానే ఎందుకు చనిపోయాడో తెలియడంలేదని వైద్యులు అన్నారు. కాగా.. కిర్దత్కు కొన్ని సంవత్సరాల నుంచి బీపీ ఉందని వైద్యులు తెలిపారు.