బీఆర్ఎస్​తోనే మైనార్టీల అభివృద్ధి : మహమూద్​అలీ

బీఆర్ఎస్​తోనే మైనార్టీల అభివృద్ధి : మహమూద్​అలీ

నారాయణపేట, వెలుగు: బీఆర్ఎస్​ హయాంలోనే మైనార్టీలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని హోం శాఖ మంత్రి మహమూద్​అలీ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అష్రుఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేసి, రూ.2 కోట్లతో నిర్మించిన ఎకో పార్క్​ను ప్రారంభించారు. అనంతరం అంజనా గార్డెన్​లో మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మైనార్టీ మహిళలకు 250 కుట్టు మిషన్లు అందజేశారు. 

ఈసందర్భంగా మహమూద్​ అలీ మాట్లాడుతూ 70 ఏండ్లుగా పేద మైనార్టీల గురించి ఎవరూ పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్​​మైనార్టీల కోసం కొత్త స్కీమ్స్​ తీసుకొచ్చారని చెప్పారు. దీనిని ప్రతిపక్ష పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని పేర్కొన్నారు. కొత్త పథకాల పేరుతో ప్రజలను మోసం చేయడానికి కుట్ర చేస్తున్నాయని చెప్పారు. మైనార్టీ ఫైనాన్స్​ కమిషన్​ చైర్మెన్​ ఇంతియాజ్​ఇసాక్​, కలెక్టర్​ కోయ శ్రీహర్ష, ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి, ఎమ్మెల్యే ఎస్​ రాజేందర్​రెడ్డి, జడ్పీ చైర్​పర్సన్​ వనజమ్మ, ఎస్పీ ఎన్​.వెంకటేశ్వర్లు, మున్సిపల్​ చైర్​పర్సన్​ అనసూయ, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు.

శ్రీనివాస్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి

మహబూబ్ నగర్ రూరల్: మంత్రి శ్రీనివాస్ గౌడ్​ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని హోం మంత్రి మహమూద్​ అలీ కోరారు. రూరల్ మండలం అప్పాయపల్లి గ్రామంలో ఐమాక్స్ లైట్లు, డ్వాక్రా భవనాన్ని ప్రారంభించారు. రూ.12 లక్షలతో చేపట్టిన మహిళా సమైక్య భవనానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను శ్రీనివాస్ గౌడ్ ఎంతో అభివృద్ధి చేశాడని పేర్కొన్నారు. ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ రాజేశ్వర్​గౌడ్, మల్లు నరసింహారెడ్డి, సుధాశ్రీ, వెంకటేశ్వరమ్మ, అనిత, ఆంజనేయులు, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.