మేక్‌‌ ఏ విష్..ఇది ముగ్గురు స్త్రీల కథ

మేక్‌‌ ఏ విష్..ఇది ముగ్గురు స్త్రీల కథ

కిరణ్  కస్తూరి నిర్మాతగా సంధ్య బయిరెడ్డి ద‌‌ర్శక‌‌త్వంలో రూపొందుతున్న చిత్రం ‘మేక్ ఎ విష్’.  ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను మంగళవారం నిర్మాతలు రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్ రిలీజ్ చేసి టీమ్‌‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. ‘ఇది ముగ్గురు స్త్రీల కథ.  వారి ప్రేమ కథలతో పాటు వారి రిలేషన్స్, ప్రాబ్లమ్స్ చుట్టూ తిరుగుతుంది.

ALSO READ :మళ్లీ థియేటర్స్​కు భైరవద్వీపం..ఈసారి మరింత కొత్తగా

కథ మొత్తం వారి జీవితంలోకి చొరబడిన వ్యక్తితో టైమ్‌‌లైన్‌‌లో ముందుకు వెనుకకు తిరుగుతుంది.  వాషింగ్టన్  డీసీ, యుఎస్‌‌ఎ ప‌‌రిస‌‌ర ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది’ అని దర్శకనిర్మాతలు చెప్పారు.