
- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య
జీడిమెట్ల, వెలుగు: సావిత్రి బాయి పూలే మహిళలు, బాలికల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసి, విద్యనందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య అన్నారు. ఆమె సేవలు మరువలేనివని పేర్కొన్నారు.
టీచర్స్డే సందర్భంగా శుక్రవారం శ్రీనివాస్నగర్లోని బీఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు నివాళి అర్పించారు. సావిత్రిబాయి పూలే ఆశయసాధనకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి రాజేశ్, నాయకులు సతీశ్, రాధాబాయి, రాజు గబ్బర్, సందీప్తదితరులున్నారు.