చత్తీస్ గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి

చత్తీస్ గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి
  • మరో ప్రాంతంలో మావోయిస్టు జంట అరెస్ట్నాలుగు తుపాకులు, 
  • మందు పాతర్ల తయారీ సామగ్రి స్వాధీనం

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​లో జరిగిన ఎన్​కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మరో ప్రాంతంలో మావోయిస్టు జంటను అరెస్ట్ చేశారు. బీజాపూర్​జిల్లాలోని ఇంద్రావతి నేషనల్​పార్కు ఏరియాలో భారీ సంఖ్యలో మావోయిస్టులు సమావేశమయ్యారనే ముందస్తు సమాచారంతో ఎస్పీ జితేంద్రకుమార్​యాదవ్​ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి డీఆర్జీ, ఎస్టీఎఫ్​ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. శనివారం ఉదయం బలగాలకు, మావోయిస్టులకు పలు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. 

దీంతో కొందరు మావోయిస్టులు  పారిపోగా, ఒకరి డెడ్ బాడీతోపాటు తుపాకీని స్వాధీనం చేసుకోగా.. ఆపరేషన్​ కొనసాగుతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్​రాజ్​పి తెలిపారు. అదేవిధంగా  కాంకేర్​జిల్లాలో అబూజ్​మాడ్ ఏరియాలోని మీండే గ్రామ అడవుల్లో బీఎస్ఎఫ్​బలగాలు కూంబింగ్​నిర్వహిస్తుండగా  మావోయిస్టు జంట అనుమానాస్పదంగా కనిపించింది.  పోలీసులను చూసి పారిపోతుండగా వెంటాడి పట్టుకుని, వారి వద్ద నాలుగు బర్మార్​తుపాకులతో పాటు, మందుపాతర్ల తయారు చేసేందుకు వినియోగించే సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు జంటను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.  బీఎస్ఎఫ్ బలగాలు పూర్తి వివరాలు వెల్లడించలేదు..