
- మావోయిస్టు, జవాన్ మృతి
భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా-, బీజాపూర్ జిల్లాల బార్డర్లో గురువారం రెండు జిల్లాలకు చెందిన ఎస్టీఎఫ్, డీఆర్జీ, కోబ్రా బలగాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నండగా మావోయిస్టులు తారసపడ్డారు. బీజాపూర్ జిల్లా పిడియా పోలీస్స్టేషన్ పరిధిలోని తుమ్రేల్ అడవుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టుతోపాటు సుక్మా జిల్లాకు చెందిన కోబ్రా జవాన్ గాయాలతో చనిపోయారు. బలగాలు తిరిగొచ్చాక పూర్తి వివరాలు చెప్తామని బీజాపూర్ ఎస్పీ అన్నారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నది.