
పెళ్లంటే ఎంతో గ్రాండ్ గా చేసుకోవాలని అందరూ అనుకుంటారు. ఎంత ఖర్చయినా అందరికీ గుర్తుండిపోయేలా చేయాలనుకుంటారు. ఎందుకంటే పెళ్లి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. అందుకే భారీగా ఖర్చు చేసి గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసింది ఓ న్యూ కపుల్. రిసెప్షన్ కు చాలా మంది వచ్చారు ఫంక్షన్ స్టాట్ అయ్యింది. కానీ ఆ న్యూ కపూల్ కు వచ్చిన అతిధులు ఒక్క సారిగా షాకిచ్చారు. దీంతో చాలా డిస్సాపాయింట్ అయ్యారు ఆ నూతన వధూవరులు. ఎందుకంటే అదే రోజును ఐపీఎల్ 12 ఫైనల్ మ్యాచ్.
హైదరాబాద్ లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అదే రోజు ఓ రిసెప్షన్ జరుగుతుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కావడంతో వచ్చిన అథిదుల కోసం రిసెప్షన్ స్టేజ్ పక్కన ఓ ఎల్ ఈడీ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. మ్యాచ్ ఇంట్రెస్ట్ గా జరగుతుండటంతో వచ్చిన వారు ఆ కపుల్ ను పట్టించుకోకుండా క్రికెట్ లో లీనమయ్యారు. సిక్స్లులు, ఫోర్లు కొట్టినప్పుడు, వికెట్ పడినప్పుడు విజిలేస్తూ కేకలు వేస్తూ గోల గోల చేస్తున్నారు తప్ప ఆ జంట వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో స్టేజ్ పైన ఉన్న జంట బిక్క మొహం వేసుకోవాల్సిన పరిస్థితి. ఇంత ఖర్చు పెట్టి రిసెప్షన్ ఏర్పాటు చేస్తే వచ్చిన అథిదులు క్రికెట్ చూడటమేంటని డిస్సాపాయింట్ అయ్యారు.