
లక్నో: విద్వేష రగిల్చే ప్రసంంగా కేసులో ఎమ్మెల్యేకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు మౌ యూపీలోని మౌ సదర్ ఎమ్మెల్యే అబ్సాస్ అన్సారీ, మన్సూర్ అన్సారీలను శనివారం (మే31) /ఉత్తరప్రదేశ్ ఎంపీ/ ఎమ్మెల్యే కోర్టు దోషులుగా తేల్చింది. ఎమ్మెల్యే అబ్బాస్కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. అబ్బాస్ గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ కుమారుడు. అబ్బాస్ కు జైలు శిక్షతోపాటు రూ.2వేల జరిమానా విధించింది.మరో నిందితుడు మన్సూర్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
ఏంటా విద్వేషపూరిత ప్రసంగం..
2022 మార్చిలో యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అబ్బాస్ అన్సారి హిసాబ్ కితాబ్ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ ప్రసంగంలో అబ్బాస్ ఓ వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అధికారులను బెదిరింపు కేసులు నమోదు చేశారు.
పహార్ గడ్లో ఎన్నికల ప్రచారంలో అబ్బాస్ అన్సారీ ప్రభుత్వ అధికారులను బెదిరించినట్టు పోలీసులు ఆరోపణలున్నాయి. ఎస్పీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారుల బదిలీకి ముందు గత పాలనలో వారు చేసిన పనికి హిసాబ్ కితాబ్ ఇవ్వాల్సి ఉంటుందని మౌ సదర్ ఎంపీ అబ్బాస్ అన్సారీ బెదిరించారని ఆరోపణలున్నాయి.
ALSO READ | ఇక మాటల్లేవ్.. బుల్లెట్లతోనే సమాధానం: పాక్కు ప్రధాని మోడీ మాస్ వార్నింగ్
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత అధికారులను వారితో ఖాతాలు పరిష్కరించే వరకు బదిలీ చేయవద్దని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్తో తాను చెప్పానని కూడా అబ్బాస్ చెప్పారని ఆరోపణలు ఉన్నాయి.
అబ్బాస్ అన్సారీ 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) టిక్కెట్పై పోటీ చేశారు. SBSP 2022 ఎన్నికల్లో SPతో కలిసి పోటీ చేసింది. అయితే ఈ కేసులో 2025 మార్చిలో సుప్రీంకోర్టు అబ్బాస్కు బెయిల్ మంజూరు చేసింది.