- ఎస్పీ డాక్టర్ వినీత్
మహబూబ్ నగర్, వెలుగు: జిల్లా పోలీస్ శాఖ మెగా క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ఉదయం 9 గంటల నుంచి జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.
ఈ టోర్నమెంట్లో జిల్లా పరిధిలోని 12 పోలీస్ స్టేషన్ల నుండి 24 యువకుల జట్లు, అదనంగా పోలీస్, మీడియా, రెవెన్యూ శాఖల ప్రత్యేక టీంలు పాల్గొంటాయన్నారు. ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్లేయర్లలో క్రీడాస్ఫూర్తి , పోలీసు, ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుందని తెలిపారు.
