- ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాల అందజేత
కోల్బెల్ట్/బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ గ్రౌండ్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ, నోబెల్ ఎంపవర్మెంట్ సొసైటీ సహకారంతో నిర్వహించిన మెగాజాబ్మేళాకు నిరుద్యోగుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఆదివారం జాబ్మేళాను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ,కలెక్టర్ కుమార్దీపక్, బెల్లంపల్లి సబ్కలెక్టర్ మనోజ్,సింగరేణి డైరెక్టర్(పీపీ) వెంకటేశ్వర్లు,డీసీపీ భాస్కర్, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ ప్రారంభించారు.
ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. బెల్లంపల్లి పట్టణంలో తొలిసారిగా నిర్వహించిన మెగా జాబ్మేళాకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. పలువురు చంటిపిల్లలను ఎత్తుకొని మేళాకు వచ్చారు.సింగరేణి సీఎండీ బలరాంనాయక్,బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చొరవతో రాష్ట్రంలోని దాదాపు 70 ప్రముఖ కంపెనీలు జాబ్మేళాలో పాల్గొన్నాయి. ఉద్యోగాల కోసం సుమారు 8,500 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 4,812 మంది మేళాకు హాజరయ్యారు.2800 మందికి ఇంటార్వ్యూలు నిర్వహించగా 1500 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ
నియామకపత్రాలు అందజేశారు.----
