'మేడ్ ఇన్ ఇండియా' ఈక్యూఎస్​ 580 ‘4మ్యాటిక్’​ ఎలక్ట్రిక్​ కారు

'మేడ్ ఇన్ ఇండియా' ఈక్యూఎస్​ 580 ‘4మ్యాటిక్’​ ఎలక్ట్రిక్​ కారు

యూరప్​ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్  'మేడ్ ఇన్ ఇండియా' ఈక్యూఎస్​ 580 ‘4మ్యాటిక్’​ ఎలక్ట్రిక్​ కారును లాంచ్​ చేసింది. జర్మనీ వెలుపల తొలిసారిగా ఈ లగ్జరీ ఈవీని ఇండియాలోనే తయారు చేశామని పేర్కొంది. ఒక్కసారి చార్జ్​ చేస్తే ఇది 580 కి.మీ ప్రయాణిస్తుంది. ధర రూ.1.55 కోట్లు. విదేశీ మోడల్​తో పోలిస్తే దీని ధర రూ.90 లక్షలు తక్కువ కావడం గమనార్హం. ఇందులోని 107.8 కిలోవాట్​ అవర్​ బ్యాటరీ 532 హెచ్​పీని ఇస్తుంది. 0‌‌‌‌‌‌‌‌‌‌‌‌-100 కి.మీ వేగాన్ని 4.3 సెకన్లలో అందుకుంటుంది.