ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో యోగా తప్పనిసరి నేర్పించాల్సిందేనన్నారు మంత్రి హరీష్ రావు. పిల్లలు యోగా చేయడం ద్వారా జ్ఞాపకశక్తి , ఏకాగ్రత పెరుగుతుందన్నారు. రోజుకు ఒక గంటపాటు యోగా చేయాలన్నారు. సంగారెడ్డి నడి బొడ్డున 80 లక్షలతో యోగా భవనం నిర్మిస్తున్నామన్నారు. అలాగే రెండు కోట్ల రూపాయలతో బిర్లా సైన్స్ మ్యూజియం నిర్మిస్తున్నామన్నారు. మనిషి జీవనం విధానం మారినందున బీపీ,షుగర్, గుండెపోటు రాకుండా ఉండడానికి యోగా చేయాలన్నారు. మనిషి ఆహారాన్ని ఔషధంగా తీసుకోవాలన్నారు. లేకపోతే మనిషికి ఔషధమే మిగులుతుందన్నారు.
see more news