తెలంగాణ సంప్రదాయాలను కాపాడుకోవాలి : మంత్రి హరీశ్​రావు

తెలంగాణ సంప్రదాయాలను కాపాడుకోవాలి : మంత్రి హరీశ్​రావు

సిద్ధిపేట, వెలుగు : తెలంగాణ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, బోనాల పండుగ రాష్ట్ర సంప్రదాయానికి ప్రతీకని మంత్రి హరీశ్​ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణం లోని 5వ వార్డులోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల జాతరకు ఆయన హాజరై ప్రత్యేక పూజలు చేశారు. 

బాధిత కుటుంబాలకు పరామర్శసిద్దిపేట పట్టణంలోని 39వ వార్డు  బీఆర్ఎస్ నాయకులు పైసా రామకృష్ణ తనయుడు ఇటీవల గుండెపోటుతో చనిపోవడంతో ఆయన కుటుంబాన్ని  మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. భారత్ నగర్ లో సత్యసాయి సమితి మెంబర్ చీకోటి విశ్వనాథ్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని మంత్రి పరామర్శించి భరోసానిచ్చారు.

ALSO READ :తమ్ముడి పాటకు మెగాస్టార్ మాస్ స్టెప్స్.. పక్కన రష్మీ కూడా!