- మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్కర్నూల్, వెలుగు: దేశం కోసం త్యాగాలకు పాల్పడిన గాంధీ కుటుంబంపై బీజేపీ కుట్రలు పన్నుతూ, కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబంపై తప్పుడు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీపై కేంద్రం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఆదివారం నాగర్కర్నూల్లో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు.
డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి విజయ్కుమార్ రెడ్డి, ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభంజనంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయమని, రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారని తెలిపారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా క్లీన్చిట్తో బయటకు వస్తారని తెలిపారు. గతంలో రాహుల్ గాంధీ క్వార్టర్ను రద్దు చేస్తే, తల్లి క్వార్టర్లో ఉండాల్సి వచ్చిందని గుర్తు చేశారు.
