జనగామలో గ్రూపు రాజకీయాలపై బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఫోకస్పెట్టారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తీరు పార్టీకి నష్టం చేస్తుందని గుర్తించిన కేటీఆర్ శుక్రవారం చేసిన ఒక్క ఫోన్కాల్తో.. జనగామలో పల్లా ఆధ్వర్యంలో చేపట్టిన కార్యకర్తల సమావేశం అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్లో అయోమయం నెలకొంది. సిట్టింగ్ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఉండగా.. కొన్ని నెలల క్రితమే జనగామ సీన్లోకి ఎమ్మెల్సీ పల్లా ఎంటర్అయ్యారు. గత నెల 21న 115 సీట్లకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్అభ్యర్థులను ప్రకటించినా, గ్రూపు తగాదాలతో జనగామను పెండింగ్లో పెట్టారు.
అప్పటి నుంచి పార్టీలో గ్రూపులు పెరిగాయి. జనగామ జెడ్పీ చైర్మన్సహా పలువురు ప్రజాప్రతినిధులు పల్లా గ్రూపులో చేరారు. మరికొందరు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు ముత్తిరెడ్డికి మద్దతుగా నిలిచారు. ఇద్దరు నేతలు హైదరాబాద్తో పాటు జనగామలో పోటాపోటీగా సమావేశాలు నిర్వహించి పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈక్రమంలోనే శుక్రవారం జనగామ శివారులోని ఒక ఫంక్షన్హాల్లో తన వర్గీయులతో పల్లా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమాచారం అందుకున్న కేటీఆర్ఎమ్మెల్సీకి ఫోన్ చేసి జనగామకు వెళ్లొద్దని ఆదేశించారు. దీంతో పల్లా జనగామకు వెళ్లకుండా హైదరాబాద్కు తిరిగి వచ్చేశారు. జనగామ అభ్యర్థిని పార్టీ ప్రకటించే వరకు ఎవరు రహస్య సమావేశాలు నిర్వహించొద్దని కేటీఆర్ ఖరాఖండిగా చెప్పారు.
పార్టీ లైన్ను దాటితే ఉపేక్షించబోమని కూడా హెచ్చరించినట్టు తెలుస్తున్నది. జనగామపై కేటీఆర్దృష్టి సారించడం, ఆయనకు అత్యంత సన్నిహితుడైన పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఇక్కడ టికెట్ఆశిస్తుండటం, తమకే చాన్స్ ఇవ్వాలని ముత్తిరెడ్డి, పల్లా పోటాపోటీ ప్రయత్నాలు చేస్తుండటంతో ఈ నియోజకవర్గ టికెట్ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.