టెక్నాలజీలో వెనుకబడ్డం : మంత్రి కేటీఆర్

టెక్నాలజీలో వెనుకబడ్డం : మంత్రి కేటీఆర్

టెక్నాలజీ విషయంలో ఇండియా ఇంకా వెనుకబడి ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇన్నోవేషన్‌ లో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని చెప్పారు. నిజామాబాద్‌లో కాకతీయ సాండ్‌ బాక్స్‌ ఆధ్వర్యంలో స్టార్టప్‌ కంపెనీల ప్రతినిధులతో జరిగిన ఇంటరాక్షన్ ​మీటింగ్​లో  ‘టెక్నాలజీ ఫర్‌ ఇంపాక్ట్‌ అండ్‌ స్కేల్‌’ అంశంపై మంత్రి మాట్లాడారు. ‘ప్రపంచం​లోనే అతిపెద్ద ఇరిగేషన్​ ప్రాజెక్ట్ ను ​నాలుగేళ్లలో నిర్మించామని, లక్ష కిలోమీటర్ల పైప్​లైన్​ వేసి మిషన్ భగీరథ ద్వారా కోటి ఇళ్లకు మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. రూరల్​ ఏరియాలకు ఐటీని విస్తరించడంతో పాటు రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని అన్నారు. ప్రతి ఇంటికీ ఫైబర్‌ కనెక్షన్‌ ఇచ్చే కార్యక్రమం చేపట్టినట్లు కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు రూ.లక్షా 18 వేల కోట్లకు పెరిగాయని ​ చెప్పారు.