హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మంత్రి కేటీఆర్ ఆదివారం ట్వీట్ చేశారు. మంగళవారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రధాని ఇచ్చిన హామీలను తన ట్వీట్లో గుర్తు చేశారు. వాటికి సంబంధించిన వార్తల క్లిప్పింగ్లను కూడా జత చేశారు. దేశంలోని ప్రతి ఒక్కరికి 2022 నాటికి నివాస సదుపాయం కల్పిస్తామని 2018 జులైలో మోడీ హామీ ఇచ్చారు. 54 లక్షల ఇండ్లు దేశంలోని పేదలకు నిర్మించి ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైందని ప్రధానికి కేటీఆర్ గుర్తు చేశారు. 2022 నాటికి దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2018 జూన్లో మోడీ ప్రకటించారు. ఈ హామీని నిలబెట్టుకోవాలని కేటీఆర్ కోరారు. 2022 నాటికి దేశంలోని ప్రతి ఇంటికి తాగునీరు, కరెంట్, టాయిలెట్ వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. బుల్లెట్ ట్రైన్, ఎకానమీని రెట్టింపు చేసి ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుస్తానని పేర్కొన్నారు. ఈ హామీలన్నీ వచ్చే బడ్జెట్లో అమలు చేయాలని కోరారు. దేశానికి అత్యధిక ఆదాయం కల్పిస్తున్న నాలుగో రాష్ట్రమైన తెలంగాణకు బడ్జెట్లో తోడ్పాటునివ్వాలన్నారు. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు రూ.24 వేల కోట్ల సాయం అందించాలని కోరారు.
పేపర్ క్లిప్పింగ్లతో ప్రధానికి కేటీఆర్ ట్వీట్
- తెలంగాణం
- January 31, 2022
లేటెస్ట్
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో