నోరు తెరిస్తే రాముడి జపం.. మతాల మధ్య చిచ్చుపెట్టే యత్నం: మంత్రి సీతక్క

నోరు తెరిస్తే రాముడి జపం.. మతాల మధ్య చిచ్చుపెట్టే యత్నం: మంత్రి సీతక్క

కాగ జ్ నగర్, వెలుగు: నోరు తెరిస్తే రాముని జపం చేస్తున్న ప్రధాని మోదీ..హిందువులకు ఇతర మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందే యత్నం చేస్తున్నాడని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో పర్యటించారు. కోసినిలో ఉపాధి కూలీలతో మాట్లాడారు. 

తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారన్నారు. అట్టడుగు వర్గాలకు హక్కులు కల్పించిన రాజ్యాంగం మార్చేదిలేదని మోదీ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే రాజ్యాంగం సురక్షితంగా ఉండి పేద వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. అదిలాబాద్ ఎంపీ గా ఆత్రం సుగుణను గెలిపించాలనిన్నారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్​ఛార్జి రావి శ్రీనివాస్ పాల్గొన్నారు.