చిత్రదుర్గ(కర్నాటక): ఇంట్లో వాళ్లు తనను ప్రేమగా చూస్తలేరని ఓ అమ్మాయి కుటుంబసభ్యులు తినే ఫుడ్ లో పురుగు మందు కలిపింది. ఈ ఘటన కర్నాటక చిత్రదుర్గ జిల్లా లంబనిహట్టిలోని ఇసముద్ర గ్రామంలో జులైలో జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామానికి చెందిన 17 ఏండ్ల అమ్మాయి మొదట అమ్మమ్మ, తాతయ్యల ఇంట్లో పెరిగింది. మూడేండ్ల క్రితం అమ్మానాన్నల దగ్గరికి వచ్చింది. ఆమెకు అన్న, ఒక చెల్లి ఉన్నారు. అయితే అన్నను, చెల్లినే ప్రేమగా చూస్తున్నారని అమ్మానాన్న, నానమ్మపై ఆమె కోపం పెంచుకుంది. దీంతో వాళ్లను చంపేందుకు ప్లాన్ వేసింది. జులై 12న రాత్రి రాగి ముద్దలు చేసిన ఆమె.. వాటిలో పురుగు మందు కలిపింది. వాటిని కుటుంసభ్యులకు పెట్టి తాను మాత్రం తినలేదు. తన చెల్లె వండిన అన్నం, రసం తిన్నది. రాగి ముద్దలు తిన్న అమ్మానాన్న, నానమ్మ, చెల్లెలు చనిపోయారు. ఆమె అన్న (19) మాత్రం బతికి బయటపడ్డాడు. ఆ ఘటన తర్వాత ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించామని, ఫోరెన్సిక్ రిపోర్టులో అందులో విషం కలిసిందని తేలిందని పోలీసులు చెప్పారు. విచారణలో తనే పురుగుమందు కలిపినట్లు అమ్మాయి ఒప్పుకుందన్నారు.
ప్రేమగా చూస్తలేరని ఇంట్లో వాళ్లను చంపింది
- దేశం
- October 20, 2021
లేటెస్ట్
- మనీష్ సిసోడియా రెగ్యులర్ బెయిల్ పై తీర్పు రిజర్వ్
- నా కూతురిది లవ్ జిహాద్ హత్యే: కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్
- మంగళగుట్ట ఆలయంలో వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
- ఎటపాకలో వైసీపీ ఎంపీటీసీ దారుణహత్య
- Kurchi Madathapetti Song: కుర్చీ మడత పెట్టి 200 మిలియన్లకు పైగా వ్యూస్తో యూట్యూబ్లో రగులుతున్న సూపర్ స్టార్మ్..
- రెండో రోజు ఆరుగురు అభ్యర్థుల నామినేషన్
- చైనాలో వాట్సాప్తోపాటు మరో యాప్ బ్యాన్.. ఎందుకంటే?
- ఏప్రిల్ 21న హనుమకొండలో సీఎం రేవంత్ సభ
- కామారెడ్డిని మరింత డెవలప్మెంట్ చేస్తాం : షబ్బీర్అలీ
- బీజేపీలో పలువురు చేరిక
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి