ఆర్మూర్, వెలుగు : ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన ఆర్మూర్ మాజీ ఎంపీపీ పస్క నర్సయ్యకు చెందిన కారును శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆర్మూర్ ఎస్ హెచ్ వో సత్యనారాయణ గౌడ్ పరిశీలించి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సమీపంలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీ సేకరించి నిందితులను పట్టుకుంటామని ఎస్హెచ్వో తెలిపారు. గ్రూపు రాజకీయాలు, కక్షతోనే కారును తగులబెట్టినట్లు భావిస్తున్నామని, పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగిలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశామని ఎస్హెచ్వో పేర్కొన్నారు.
