యాదాద్రికి నల్ల కలువలు .. మే 15న జిల్లాకు 35 దేశాల అందగత్తెలు​

యాదాద్రికి నల్ల కలువలు .. మే 15న జిల్లాకు 35 దేశాల అందగత్తెలు​
  • సౌతాఫ్రికా, కరేబియన్ బ్యూటీస్​ సింగిల్ డే.. టూ టీమ్స్​
  • యాదాద్రి నర్సన్న దర్శనం..పోచంపల్లి ఇక్కత్ ​చీరల పరిశీలన
  • రెండు గంటల్లో కంప్లీట్​

యాదాద్రి, వెలుగు : రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు లభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు మిస్​వరల్డ్ కాంటెస్ట్​ను ప్రభుత్వం వేదికగా చేసుకుంది. ఈ పోటీలకు వస్తున్న 108 దేశాలకు చెందినవారిలో పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా షెడ్యూల్​రూపొందించింది. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లాలో టూరిస్ట్​ ప్లేస్​లు చూసేందుకు ఈనెల 15న సౌతాఫ్రికా, కరేబియన్​లోని 35 దేశాలకు చెందిన కంటెస్టెంట్స్​ వస్తున్నారు. జిల్లాలోని పట్టుచీరలకు నెలవైన భూదాన్​పోచంపల్లి, ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్​కు వస్తున్న బ్యూటీలు రెండు గంటలపాటు సందడి చేయనన్నారు.
 
యాదగిరిగుట్టలో.. 

పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు 10 మంది బ్యూటీస్ వస్తున్నారు. కొండపై వీరు రెండు గంటలపాటు గడపనున్నారు. యాదగిరిగుట్ట టెంపుల్​కు చేరుకున్న వీరికి బొట్టు పెట్టి సంప్రదాయ రీతిలో స్వాగతం పలుకుతారు. ముందుగా వీరు బ్యాటరీ వెహికల్​పై కొండపైకి చేరుకుంటారు. అక్కడ అఖండ దీపం వద్దకు వెళ్లి జ్యోతిని వెలిగిస్తారు. ఆ తర్వాత తూర్పు రాజగోపురం గుండా ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. అనంతరం వారికి అర్చకులు వేదాశ్వీరచనం చేస్తారు. ఆ తర్వాత ఆలయ మాడవీధుల్లో పర్యటిస్తూ కట్టడాలను పరిశీలించి.. ఫొటోలు దిగి గెస్ట్​హౌస్​కు చేరుకొని టిఫిన్ చేస్తారు. అనంతరం హైదరాబాద్​కు వెళ్లిపోతారు. 

భూదాన్​పోచంపల్లిలో..

పట్టుచీరలకు నెలవైన భూదాన్​ పోచంపల్లికి 25 మంది బ్యూటీస్ వస్తున్నారు. చేనేత మ్యూజియం వద్దకు చేరుకున్న వీరికి తెలంగాణ సంప్రదాయ రీతిలో కోలాటంతో స్వాగతం పలుకుతారు. చేనేత స్టాల్స్​ను సందర్శించి అక్కడి ఇక్కత్​ చీరలను పరిశీలిస్తారు. అనంతరం వీరి చేతులను మెహందీతో అలంకరించి ట్రెడీషనల్​ మ్యూజిక్​ విన్పిస్తారు. ఇక్కత్​వస్త్రాలను ధరించిన స్థానిక మహిళలు షో చేస్తారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్​కు బయల్దేరుతారు. 

ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్..

మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు టూర్​కు యాదగిరిగుట్ట, భూదాన్​ పోచంపల్లిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను కలెక్టర్​హనుమంతరావు పరిశీలించారు. వీరు వెళ్లే ప్రతి ప్లేస్​కు కలెక్టర్​వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించారు. బ్యూటీస్​ఇక్కడికి చేరుకోగానే వారిని ఎలా స్వాగతించాలన్న విషయంపై ఇప్పటికే రిహార్సల్ ​కూడా జరిపించారు.

ఓరుగల్లుకు వెళ్తున్న బ్యూటీస్​కు భువనగిరిలో రెస్ట్..

ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు ఈనెల 14న వస్తున్న బ్యూటీస్​ కోసం భువనగిరిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భువనగిరి బైపాస్​లోని ఓ హోటల్​లో గదులు కేటాయించారు. హైదరాబాద్​ నుంచి వస్తున్న వీరు ఈ హోటల్​లో ప్రెషప్​అయిన తర్వాత స్నాక్స్​ తీసుకొని వరంగల్​కు వెళ్తారు. తిరుగు ప్రయాణంలో కూడా ఇదే హోటల్​లో ఫ్రెషప్ అవుతారు. స్నాక్స్ తీసుకున్న అనంతరం హైదరాబాద్​కు చేరుకుంటారు. 

మూడంచెల భద్రత..

వివిధ దేశాలకు చెందిన వీరి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కోసం వందలాది మంది పోలీసులు డ్యూటీలో కొనసాగుతారు. మూడంచెల భద్రత మధ్య వీరి పర్యటన కొనసాగుతుంది. ఇంటర్నేషనల్​బ్యూటీల వెంట ఒక్కొక్కకరికీ ఒక్కో మహిళా కానిస్టేబుల్​ను నియమిస్తారు. అడిషనల్​కలెక్టర్, ఇద్దరు ఆర్డీవోలు సహా 20 డిపార్ట్​మెంట్లకు చెందిన హెడ్స్​ఏర్పాట్లలో పాలు పంచుకుంటున్నారు. వీరి కోసం వీవర్​కమ్యూనిటీకి చెందిన 20 మంది మహిళలు, స్వయం సహాయక సంఘాలకు చెందిన మరో 20 మంది మహిళలను ఎంపిక చేశారు. ఈ అందగత్తెలు టెంపుల్​పరిధిలో ఉన్నంత సేపు పూర్తిగా పోలీసులు పర్యవేక్షణ ఉంటుంది. వారిని కలవడానికి ఎవరినీ అనుమతించరు. స్వామివారి దర్శనానికి భక్తులను కూడా అనుమతించరు.