గొల్ల కురుమల అభివృద్ధికి తోడ్పాటు : బాజిరెడ్డి గోవర్దన్

గొల్ల కురుమల అభివృద్ధికి  తోడ్పాటు : బాజిరెడ్డి గోవర్దన్

డిచ్​పల్లి, వెలుగు: రాష్ట్రంలో గొల్ల, కురుమల అభివృద్ధికి బీఆర్ఎస్​ ప్రభుత్వం  తోడ్పాటు అందించిదని  రూరల్​ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్​ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్​ హాల్​లో నిర్వహించిన యాదవ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. గొల్ల కురుమలు ఆర్థికంగా వృద్ధి చెందడానికి సబ్సిడీ  గొర్రెల పంపిణీని కేసీఆర్​ ప్రారంభించారన్నారు.  బీఆర్ఎస్​ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకోని గడప రాష్ట్రంలో ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న  సంక్షేమం, అభివృద్ధిని చూసి బీఆర్​ఎస్​ కు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీటీసీ జగన్​, ఐడీసీఎంఎస్​ చైర్మెన్​మోహన్, యాదవ సంఘం లీడర్లు మహిపాల్ యాదవ్, నర్సయ్య, రాజారాం యాదవ్​ తదితరులు పాల్గొన్నారు.