అంబేద్కర్​తోనే తెలంగాణ వచ్చింది: చిట్టెం రామ్మోహన్​రెడ్డి

అంబేద్కర్​తోనే తెలంగాణ వచ్చింది: చిట్టెం రామ్మోహన్​రెడ్డి

మరికల్, వెలుగు: అంబేద్కర్​ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్​-3 ప్రకారమే తెలంగాణ ఏర్పడిందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని జిన్నారంలో అంబేద్కర్​ విగ్రహావిష్కరణతో పాటు రూ.1.5 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మతాలు, కులాలన్నీ ఒక్కటేనని చాటి చెప్పారని కొనియాడారు. విగ్రహదాత ఎంపీపీ శ్రీకళ, రాజవర్ధన్​రెడ్డిలను సన్మానించారు. జడ్పీ వైస్​ చైర్​పర్సన్​ సురేఖరెడ్డి, సర్పంచులు భాస్కర్, అరుంధతి, శరత్​చంద్రారెడ్డి, ఉప సర్పంచ్​ వసుంధర, ఎమ్మార్పీఎస్​ నేతలు సింగిరెడ్డి పరమేశ్వర్, రాందాస్, కృష్ణయ్య పాల్గొన్నారు.