రాష్ట్రం వచ్చాకే కోతల్లేని కరెంట్​

రాష్ట్రం వచ్చాకే కోతల్లేని కరెంట్​

కామారెడ్డి, వెలుగు: దేశంలో కరెంట్​ కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మిదేవి గార్డెన్​లో విద్యుత్​ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. స్టేట్​ఏర్పడకముందు కరెంట్​ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. కలెక్టర్ ​జితేశ్​వి పాటిల్, ఎన్పీడీసీఎల్​ డీఈ సాలియా నాయక్, మున్సిపల్ ​చైర్​పర్సన్​ జాహ్నవి పాల్గొన్నారు.

ఆర్మూర్: రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని సంస్కరించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ లో సోమవారం నిర్వహించిన విద్యుత్​రంగ విజయోత్సవాలకు హాజరై మాట్లాడారు. నిరంతర, నాణ్యమైన విద్యుత్‌‌ సరఫరాలో తెలంగాణ నెంబర్‌‌వన్‌‌ పొజిషన్​లో ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో గోవింద్, జడ్పీటీసీ మెట్టు సంతోష్, ఎంపీపీలు మాస్త ప్రభాకర్, పస్క నర్సయ్య  పాల్గొన్నారు.

Also Read:వడ్ల పైసలు పడ్తలేవ్

పిట్లం: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాకే కరెంట్ కష్టాలు తొలిగాయని ఎమ్మెల్యే హన్మంత్​షిండే పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం బిచ్కుందలో విద్యుత్ ​విజయోత్సవం నిర్వహించారు. డీఈఈ రామేశ్వరరావు, ఎంపీపీ అశోక్​పటేల్, జడ్పీ సీఈవో సాయాగౌడ్​ పాల్గొన్నారు.

బోధన్: కరెంట్​ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్​వన్​గా ఉందని ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నారు. సోమవారం పట్టణ శివారులోనే ఏఆర్​గార్డెన్​లో దశాబ్ది  ఉత్సవాల్లో భాగంగా విద్యుత్​ప్రగతిలో సాధించిన విజయాలు వివరించారు. కార్యక్రమంలో మార్కెట్​కమిటీ చైర్మన్​ వీఆర్​దేశాయ్ పాల్గొన్నారు.