ఎల్ఆర్ఎస్ ఫీజు రద్దు చేయాలి : సంజయ్ కుమార్

ఎల్ఆర్ఎస్ ఫీజు రద్దు చేయాలి :  సంజయ్ కుమార్

జగిత్యాల టౌన్, వెలుగు : ఎల్ఆర్ఎస్ ఫీజు రద్దు చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ బాషాకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్​ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను తీసుకువచ్చినప్పుడు ప్రస్తుత మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క

ఉత్తమ్ కుమార్ లు వ్యతిరేకించారని, ఇప్పుడు ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు ఫీజు ఎందుకు వసూల్​చేస్తున్నారని ప్రశ్నించారు. రాయికల్ మున్సిపల్ చైర్మన్ హనుమండ్లు, జడ్పీటీసీ అశ్విన్ జాదవ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు, లీడర్లు పాల్గొన్నారు.