మహబూబ్నగర్అర్బన్, వెలుగు: ప్రతీ డివిజన్ను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి అన్నారు. 9వ వార్డులోని వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో రూ.9.50 లక్షలతో నిర్మించనున్న మల్టీ పర్పస్ షెడ్, 20వ డివిజన్లో రూ. 8 లక్షలతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, బాలాజీనగర్ లో రూ.3 కోట్లతో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. లైబ్రరీ చైర్మన్ నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అనిత పాల్గొన్నారు.
పదో డివిజన్ సమస్యలు పరిష్కరించాలి
మహబూబ్ నగర్ టౌన్: నగరంలోని 10వ డివిజన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఎం నాయకుడు ఆది విష్ణు కోరారు. ఆదివారం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, మినీ ఫంక్షన్ హాల్ నిర్మించాలని కోరారు.
యారోనిపల్లికి రోడ్డు వేయండి
హన్వాడ: వేపూర్ మెయిన్ రోడ్డు నుంచి యారోనిపల్లి వరకు రోడ్డు వేయాలని సర్పంచ్ స్వాతి కోరారు. ఆదివారం ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డికి వినతిపత్రం అందించారు. వర్షాకాలంలో మట్టిరోడ్డు బురదగా మారి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని కోరారు. ఉపసర్పంచ్ మైబమ్మ, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
