ఢిల్లీలో బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. తర్వాత బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితులు, వివిధ రాష్ట్రాల్లో కేంద్ర పథకాల అమలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీలోని NDMC కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న సమావేశాలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా, అన్ని రాష్ట్రాల జనరల్ సెక్రెటరీలతో పాటు ఇతర నేతలు హాజరయ్యారు.