మాదిగలకు ఎంపీ టికెట్లు ఇవ్వకపోవడం బాధాకరం :మోత్కుపల్లి నర్సింహులు

మాదిగలకు ఎంపీ టికెట్లు ఇవ్వకపోవడం బాధాకరం :మోత్కుపల్లి నర్సింహులు

ఓయూ, వెలుగు: రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క ఎంపీ టికెట్​కూడా ఇవ్వకపోవడం బాధాకరమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు వాపోయారు. సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఓయూలో మహనీయుల జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మోత్కుపల్లి పాల్గొని మాట్లాడారు. ఎంపీ టికెట్లు ఇవ్వకపోవడంతో మాదిగల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తాము పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే మాదిగల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని, ప్రజల్లో తిరగలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ సమయం ఉందని, కాంగ్రెస్​హైకమాండ్​పునరాలోచించి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ప్రొఫెసర్ కాశిం, రమిళ్ల రాధిక, సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తాళ్ల అజయ్, సురేందర్ మాదిగ, బి.నాగేశ్వరరావు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.