సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో యుద్ధ వీరులకు సినీ హీరో రామ్ చరణ్ తేజ నివాళులర్పించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన యుద్ధ వీరులకు నివాళులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ అధికారులు, పలు స్కూలు విద్యార్థులతో పాటు రామ్ చరణ్ తేజ కూడా పాల్గొన్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవ ఉత్సవాలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. 75ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలను జరుపుకోవడం గర్వంగా ఉందన్న రామ్ చరణ్.. దేశ భద్రతను కాపాడుతున్న జవాన్ల త్యాగాన్ని గౌరవించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారాయన. వీరుల త్యాగాలను ఎవరూ మరిచిపోకూడదని, ఇవాళ దేశం ఇంత ప్రశాంతంగా ఉందంటే అది మన సైనికుల వల్లే అని చెప్పారు.
మరిన్ని వార్తల కోసం..