- తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి
- సోషల్ మీడియా టీమ్ మీటింగ్ లో అర్వింద్
హైదారాబాద్, వెలుగు : బీజేపీపై బీఆర్ఎస్, కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సోషల్ మీడియా టీమ్ మెంబర్లకు ఆ పార్టీ ఎంపీ అర్వింద్ సూచించారు. గురువారం స్టేట్ ఆఫీస్ లో సోషల్ మీడియా టీమ్ మెంబర్లతో అర్వింద్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, పార్టీ అధికార ప్రతినిధి కిషోర్ సమావేశమయ్యారు.
సోషల్ మీడియా టీమ్ ను మరింత బలోపేతం చేయాలని నేతలు సూచించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫేక్ వార్తలు, పాత వీడియోలు, మార్ఫింగ్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉందని.. వాటికి ఫ్యాక్ట్ చెకింగ్ చేసి, నిజమేదో అబద్ధమేదో చెబుతూ వారికి కౌంటర్ ఇవ్వాలన్నారు.