న్యూఢిల్లీ: పాకిస్థాన్ జాతి పిత మహ్మద్ అలీ జిన్నాను పొగిడితే భారత్లో పొంగిపోయే వారెవరూ లేరని మజ్లిస్ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. జిన్నాను పొగుడుతూ ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో జిన్నా కీలకమని.. ఆయన పోరాటానికి ఎప్పుడూ వెనుకాడలేదని అఖిలేఖ్ చేసిన కామెంట్లపై ఒవైసీ సీరియస్ అయ్యారు. ఒక వర్గం ప్రజల్ని సంతోషపెట్టడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని.. ఆయన తన అడ్వయిజర్లను మార్చుకోవాలని చురకలంటించారు. అఖిలేశ్ హిస్టరీ చదవాలని సూచించారు. అసలు భారత ముస్లింలకు జిన్నాతో ఏం సంబంధమని ఒవైసీ ప్రశ్నించారు. రెండు దేశాల సిద్ధాంతాన్ని మన పెద్దలు వద్దనుకున్నారని.. అందుకే ఇండియాలో ఉండటానికి నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.
Delhi | Akhilesh Yadav should understand that Indian Muslims have nothing to do with Muhammad Ali Jinnah. Our elders rejected the two nation theory and chose India as their country: AIMIM chief Asaduddin Owaisi https://t.co/vBZaoFIma0 pic.twitter.com/m4ZRhRHPDt
— ANI (@ANI) November 1, 2021