అమెరికాకు బండి సంజయ్.. 10 రోజులపాటు యూఎస్లోనే

అమెరికాకు బండి సంజయ్.. 10 రోజులపాటు యూఎస్లోనే

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ అమెరికాకు వెళ్లనున్నారు. 10 రోజులపాటు యూఎస్లోనే ఉండనున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ శుక్రవారం రోజు తెల్లవారుజామున యూఎస్కి వెళ్లనున్నారు బండి సంజయ్. సెప్టెంబర్ 2న అట్లాంటాలోని గ్యాస్ సౌత్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్తా) 15 వార్షికోత్సవంలో ప్రసంగించనున్నారు.

వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, న్యూజెర్సీ, డల్లాస్ సహా పలు రాష్ట్రాల్లో బండి సంజయ్ పర్యటన ఖరారైంది. పలు ఎన్ఆర్ఐ సంఘాలతోనూ బండి సంజయ్ సమావేశం కానున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినిమా, కళా, సాహిత్య, నాటక, సేవా, వైద్య, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు.