మరాఠా కులస్తులను ఓబీసీలోకి చేర్చాలి : సోయం బాపురావు

మరాఠా కులస్తులను ఓబీసీలోకి చేర్చాలి : సోయం బాపురావు

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: తెలంగాణలోని మరాఠాలను కేంద్ర ప్రభుత్వం ఓబీసీలోకి చేర్చాలని ఎంపీ సోయం బాపురావు కోరారు. శుక్రవారం  బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్​ ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లిన మరాఠా కులస్తులతో కలిసి జాతీయ బీసీ సంక్షేమశాఖ చైర్మన్ హన్సరాజ్​ గంగారాంను  కలిసి వినతి పత్రం అందజేశారు.  తెలంగాణలోని మరాఠాలకు బీసీ గుర్తింపు ఉన్నా కేంద్ర పథకాలు, ఉద్యోగాలకు ఓబీసీ అర్హత అందడం లేదన్నారు. దీనికి స్పందించిన చైర్మన్ మరాఠాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో విజయ్​ బోయర్, దశరథ్ పాటిల్, మురళీధర్, దత్తానికం, సందీప్, తదితరులు పాల్గొన్నారు.