రాంచీ: వచ్చే ఐపీఎల్ కోసం..చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ ధోనీ ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. శుక్రవారం జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అకాడమీ నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చాడు. దాదాపు రెండు గంటల పాటు నెట్ ప్రాక్టీస్లో పాల్గొన్న మహీ అన్ని రకాల షాట్లు కొట్టాడు.ఎంఎస్ ప్రాక్టీస్ చేస్తున్నంతసేపు అకాడమీ వైపు ఎవర్నీ రానివ్వలేదు. కేవలం నెట్ బౌలర్స్ను, ఇండోర్ ఫెసిలిటీ స్టాఫ్ను మాత్రమే లోపలికి అనుమతించారు. ధోని ప్రాక్టీస్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
2022 ఐపీఎల్ లో ధోని పర్వాలేదనపించాడు. ఈ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన ధోని.... 232 పరుగులు చేశాడు. 15వ ఐపీఎల్ సీజన్లో తొలుత సీఎస్కే కెప్టెన్గా జడేజా ఎంపికయ్యాడు. అయితే కెప్టెన్సీ ఒత్తిడి తట్టుకోలేక జడేజా.. తిరిగి జట్టు పగ్గాలు ధోనికే అప్పగించాడు. అటు ఐపీఎల్-2022లో చెన్నై దారుణంగా ఆడింది. 14 మ్యాచ్ల్లో కేవలం నాలుగు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో 9 స్థానానికి పరిమితమైంది.