వెల్త్ కంపెనీ నుంచి మల్టీ అసెట్ ఫండ్

వెల్త్ కంపెనీ నుంచి మల్టీ అసెట్ ఫండ్

హైదరాబాద్​, వెలుగు: పాంటోమత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్​కు చెందిన ది వెల్త్ కంపెనీ మ్యుచువల్ ఫండ్, తమ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్​ను ప్రారంభించింది. ఇది ఈక్విటీలు, డెట్ కమోడిటీలలో పెట్టుబడులు పెట్టే హైబ్రిడ్ ఫండ్. ఎన్ఎఫ్‌‌‌‌‌‌‌‌వో ఈ నెల 19న ప్రారంభమై వచ్చే నెల మూడున ముగుస్తుంది.  

ఈ ఫండ్ దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం ఈక్విటీలు, స్థిరత్వం కోసం ఫిక్సిడ్ ఇన్‌‌‌‌‌‌‌‌కమ్​ స్కీములు, ద్రవ్యోల్బణం, హెడ్జింగ్ డైవర్సిఫికేషన్ కోసం బంగారం, వెండి లాంటి లోహాలపై ఫోకస్​చేస్తుంది.  హైబ్రిడ్ ట్యాక్సేషన్ నిబంధనల ప్రకారం పన్నుల ప్రయోజనాలు ఉంటాయి.  కమోడిటీలకు 50 శాతం వరకు కేటాయించే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల వివిధ మార్కెట్ పరిస్థితుల్లో పెట్టుబడులను సర్దుబాటు చేస్తారు.