అభివృద్ధిని చూసి ఓటేయాలి : జోగు ప్రేమేందర్

అభివృద్ధిని చూసి ఓటేయాలి :  జోగు ప్రేమేందర్

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ లో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. గురువారం పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు బీఆర్​ఎస్​లో చేరారు.

గత ప్రభుత్వాల హయాంలో ఎదుర్కొన్న ఎన్నో సమస్యలను కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. కాంగ్రెస్ పాలనలో విపరీతమైన కరెంటు కోతలు ఉండేవని, వేసవి వస్తే 9 గంటల కరెంటు మాత్రమే ఇచ్చేవారని గుర్తు చేశారు. ప్రజలకు మంచి నీటిని కూడా సరిగా ఇవ్వలేదని,  కానీ రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవన్నారు. బీఆర్​ఎస్​కు ఓటేసి గెలిపించాలని కోరారు.