హిందువుకు అంత్యక్రియలు నిర్వహించిన ముస్లింలు

హిందువుకు అంత్యక్రియలు నిర్వహించిన ముస్లింలు

హిందూ మతస్థుడి అంత్యక్రియలకు అయినవారు రాలేకపోయినా.. సాటి ముస్లింలు మానవత్వం ప్రదర్శించి మతసామరస్యం చాటారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మతాల అడ్డుగోడలను అధిగమించి ఆదర్శంగా నిలిచారని.. మానవత్వానికి, మతసామరస్యానికి అద్దం పట్టిన ఈ అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షెహర్ లో జరిగిందని రాశారు. రవిశంకర్‌ అనే వ్యక్తి క్యాన్సర్‌ వ్యాధితో ఆదివారం మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. లాక్ డౌన్ క్ర‌మంలో అంత్యక్రియలకు బంధువులు, స్నేహితులు రాలేకపోయారని… నిరుపేద కుటుంబం దీనావస్థను గమనించిన చుట్టుపక్కల ముస్లింలు.. రవిశంకర్‌ అంత్యక్రియల్లో సాయం చేశారని చెప్పారు.

స్వయంగా పాడె మోసి మృతదేహాన్ని శ్మశానికి తరలించడంలో సహాయపడ్డారు. భౌతికకాయాన్ని తరలించే సమయంలో రామ్‌ నామ్‌ సత్య హై అంటూ నినాదాలు చేస్తూ.. మతసామరస్యాన్ని చాటారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు తోడ్పాటు అందించారనే న్యూస్ వైరల్ అవుతుంది.