మైనంపల్లి బూతుపురాణం 

మైనంపల్లి బూతుపురాణం 

హైదరాబాద్​, వెలుగు: బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​పై మల్కాజ్​గిరి టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బూతుపురాణం అందుకున్నారు. రా చూసుకుందాం అని హెచ్చరించారు. రాయడానికి కూడా ఉపయోగించని కామెంట్లు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బండి సంజయ్.. నన్ను రెచ్చగొడుతున్నవ్​. నీ మొహం నేనెప్పుడూ చూడలేదు. యూజ్​లెస్​​ ఫెలో.  పార్టీకి స్టేట్​ ప్రెసిడెంట్​వైతే ఏమైనా చేయొచ్చనుకుంటున్నవా? నువ్వు ఏమిచేసినా నాకు సత్తావుంది.  నువ్వు అడ్రస్​ లేనోడివి. ఏమి చేస్తవ్​ నన్ను. తిరగనియ్యవా.. నీకు దమ్ముంటే రా. నా సత్తా ఏందో చూపిస్తా” అని ఊగిపోయారు. తనకు ప్రజల బలం ఉందని, తాను సీనియర్​ మోస్ట్​ లీడర్​నని, తన ముందు సంజయ్ బచ్చా  అని వ్యాఖ్యానించారు. ‘‘నేను నిన్ను కలిసింది నిరూపిస్తే నీకు గులాంగిరి చేస్తా, పాలిటిక్స్​ని వదిలేస్తా, పాలిటిక్స్​తో బతికెటోడ్ని కాదు. మర్డర్​ల గురించి మాట్లాడుతున్నవ్. ఏం మాట్లాడుతున్నవ్..​ తెలివిలేద్​. వల్గర్​గా మాట్లాడుతున్నవ్​. నీకే మాట్లాడనీకి వస్తదా? గుండు పలగ్గొడతా” అని హెచ్చరించారు. 
నేనంటే హడల్​
తన క్యాడర్​ ముందు సంజయ్​ ఎంత అని మైనంపల్లి అన్నారు. ‘‘మొత్తం జిల్లా జిల్లాల నుంచి వస్తయ్. మైనంపల్లి అంటే హడల్.  మైనంపల్లి సర్వీసెస్​ అన్ని జాగల్ల, ప్రతి ఊర్ల ఉన్నయ్. సంజయ్​.. నన్ను యూజ్​​లెస్​ ఫెలో అంటవా. నా ముందు నువ్వు బచ్చాగానివి. నువ్వెంత .. నీ బతుకెంత?  రోజులు లెక్క పెట్టుకో. నీకు గుండు కొట్టించే దాకా నిద్రపోను. వాళ్లని తిట్టినా, వీళ్లని తిట్టినా అని మాట్లాడుతున్నవ్​. నీ ముందు తిట్టిన్నా? రేపటి నుంచి చూపిస్తా. బిడ్డా.. నేను నీకు వార్నింగ్​ ఇస్తున్న. నిన్ను ఏడ తిరగనియ్య” అంటూ హెచ్చరించారు. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో సంజయ్​ ఓడిపోయేదాకా వెంటపడుతానన్నారు. ‘చూపిస్త మైనంపల్లి అంటే ఏందో. జాన్​ గయాతో ఫరక్​ నైపడ్త, షాన్​ మె ఫరక్​ నహీ ఆత. సత్తా ఉంటే ఎదుర్కో. ఏడికి రమ్మంటే ఆడికి వస్తా. హైదరాబాద్​ సిటీ సెంటర్​కు రమ్మంటే వస్తా. రేపు హుజూరాబాద్​ పోతున్న.  దమ్ముంటే.. రమ్మంటే కరీంనగర్​ వచ్చి హుజూరాబాద్​ పోత” అని సవాల్​ విసిరారు.