ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్లు కీలకం : కలెక్టర్ బదావత్ సంతోష్

ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్లు కీలకం : కలెక్టర్  బదావత్  సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్లు కీలకమని నాగర్​కర్నూల్​ కలెక్టర్  బదావత్  సంతోష్  పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లో అబ్జర్వర్​ రాజ్యలక్ష్మి, అడిషనల్​ కలెక్టర్  దేవ సహాయంతో కలిసి మీటింగ్  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు పోలింగ్  ప్రక్రియను పరిశీలించాలని, పీవోలు, ఏపీవోల విధుల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు. 

ప్రతి అంశాన్ని పరిశీలించాలని, ఉదయం 6 గంటలకు పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలని కోరారు. సీఈవో గోపాల్ నాయక్, డీపీవో శ్రీరాములు, ఎల్డీఎం చంద్రశేఖర్  పాల్గొన్నారు. జిల్లాలోని పేద విద్యార్థులందరికీ స్కాలర్​షిప్  అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ నెల 30 వరకు 100 శాతం అప్లై చేయాలని ఆదేశించారు. అడిషనల్​ కలెక్టర్  అమరేందర్, డీఈవో రమేశ్ కుమార్, సంక్షేమ శాఖ అధికారులు ఉమాపతి, ఫిరంగి, చంద్రశేఖర్  పాల్గొన్నారు.

నామినేషన్ల ఉపసంహరణ పరిశీలన..

కందనూలు: బిజినేపల్లి మండలం పాలెం క్లస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రెండవ విడత ఎన్నికల ఉపసంహరణ ప్రక్రియను కలెక్టర్  బదావత్​ సంతోష్​ పరిశీలించారు. ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, ప్రలోభాలకు లోనుకాకుండా స్వచ్ఛందంగా నామినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఉపసంహరించుకుంటున్నట్లు అభ్యర్థులతో డిక్లరేషన్​ తీసుకోవాలని సూచించారు. తహసీల్దార్  మునీరుద్దీన్, ఎంపీడీవో కథలప్ప  ఉన్నారు.