
హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం నిలకడగా కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వదర నీటి కారణంగా సాగర్ ప్రాజెక్ట్ గరిష్ట స్థాయి నీటి మట్టానికి చేరువలోకి వచ్చింది. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్ కు 65,530 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు) కాగా, శనివారం సాయంత్రం 6 గంటలకు వరకు 589.70 అడుగుల (311.1486 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. సాగర్జలాశయం నుంచి ఎడమ కాల్వకు 7,436 క్యూసెక్కులు, కుడి కాల్వకు 6,041 క్యూసెక్కులు, హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలకు ఏఎమ్మార్పీకి 1800 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు.