- సాయంత్రం హంస వాహనంపై విహరించిన స్వామివారు
- నాలుగో రోజుకు చేరిన యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం ఉదయం స్వామివారు వటపత్రశాయి అలంకారంలో దర్శనమిచ్చారు. రాత్రి హంస వాహనంపై ప్రధానాలయ తిరువీధుల్లో ఊరేగుతూ కనువిందు చేశారు. మర్రి ఆకుపై స్వామి, అమ్మవార్లను అలంకరించి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. రాత్రి 7 గంటలకు ప్రధానాలయంలో స్వామివారి హంస వాహన సేవను నిర్వహించారు. ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో రామకృష్ణారావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవో గజవెల్లి రఘు, సూపరింటెండెంట్లు దొమ్మాట సురేందర్ రెడ్డి, వాసం వెంకటేష్, రాజన్ బాబు ఉన్నారు. శుక్రవారం శ్రీకృష్ణ అలంకారం(మురళీకృష్ణుడు), పొన్నవాహన సేవను నిర్వహించనున్నారు.