ఆరు గ్యారెంటీలతో పేదల జీవితాల్లో వెలుగులు : నారాయణ్​రావు పటేల్

ఆరు గ్యారెంటీలతో పేదల జీవితాల్లో వెలుగులు : నారాయణ్​రావు పటేల్

భైంసా/లోకేశ్వరం, వెలుగు : కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ స్కీమ్​లతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆ పార్టీ ముథోల్​అభ్యర్థి నారాయణ్​రావు పటేల్ అన్నారు. గురువారం లోకేశ్వరం మండల కేంద్రంలో పార్టీ ఆఫీస్​ను ప్రారంభించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​కు వస్తున్న ఆదరణను చూసి బీఆర్ఎస్, బీజేపీలు తట్టుకోలే అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్నారు. 

తొమ్మిదేండ్లు ఎమ్మెల్యేగా ఉన్న విఠల్​రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. ఒక్క అవకాశమిస్తే ముథోల్​నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుతానన్నారు. లీడర్లు ఆనంద్​రావు పటేల్, భీంరావు, అంజద్​తో పాటు కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.