ఆదిలాబాద్టౌన్,వెలుగు: స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. మంగళవారం స్థానిక ఓ ఫంక్షన్హాల్లో ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి జాతీయ జెండాలు పంపిణీ చేశారు. అంతకుముందు స్థానిక మహేశ్వరీ థియేటర్లో గాంధీ సినిమా ప్రదర్శన విద్యార్థులతో కలిసి చూశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు రిజ్వాన్ బాషాషేక్, ఎన్.నటరాజ్, ఆర్డీవో రమేశ్రాథోడ్, మున్సిపల్ కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.
సమరయోధులకు సన్మానం
ఆసిఫాబాద్,వెలుగు: జిల్లాలో నిర్వహించే స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడలోని ఫంక్షన్హాల్లో స్వాతంత్ర్య సమరయోధుడు దండనాయకుల శ్రీనివాసరావు దంపతులను సన్మానించారు. అనంతరం జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అడిషనల్కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్పేయ్, ఆర్డీవో దత్తు తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ ఇంటిపై జాతీయ జెండా
నిర్మల్,వెలుగు: జిల్లాలో ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా అందరికీ జెండాలు పంపిణీ చేశారు. విద్యార్థులందరికీ గాంధీ జీవిత చరిత్ర సినిమా ఫ్రీగా చూపిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్లోని నారాయణ థియేటర్, భైంసాలో కమల టాకీస్లో సినిమా ప్రదర్శించినట్లు వివరించారు. కార్యక్రమంలో డీఈవో రవీందర్ రెడ్డి, ఎంవీఐ హరీంద్రకుమార్, డీఎస్పీ జీవన్ రెడ్డి, డీపీఆర్వో తిరుమల, తదితరులు పాల్గొన్నారు.