చివరి వరకూ జైపాల్ రెడ్డి విలువలతో కట్టుబడి ఉన్నారు

చివరి వరకూ జైపాల్ రెడ్డి విలువలతో కట్టుబడి ఉన్నారు

దేశంలో నాలుగు స్తంభాలపై చాలా దాడులు జరుగుతున్నాయని, వీటి నుంచి తట్టుకుని దేశాన్ని కాపాడుకోవాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఇందుకోసం మళ్లీ సిద్ధాంతాలు, విలువలతో కూడిన రాజకీయాలు అవసరం అని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి స్పూర్తితో ఆ దిశగా ముందుకెళ్లాలన్నారు. లౌకిక ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకునేందుకు పునః సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

విద్యార్థి దశలో జైపాల్ రెడ్డి, తాను మొదటిసారిగా కలుసుకున్నామని సీతారాం ఏచూరి చెప్పారు. జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో జైపాల్ రెడ్డి, తాను కలిసి పని చేశామని చెప్పారు. సిద్ధాంతాల ఆధారంగా జైపాల్ రెడ్డి రాజకీయాలు చేశారని, చివరి వరకూ విలువలకు కట్టుబడి ఉన్నారని అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువలు లోపించాయని చెప్పారు. జైపాల్ రెడ్డి లేకపోవడం దేశానికి తీరనిలోటు అన్నారు.