
న్యూఢిల్లీ: ఎన్సీసీ ఫౌండర్, చైర్మన్ఎమిరటస్ డాక్టర్ ఏవీఎస్రాజు ‘స్టాండింగ్ టాల్’ పేరుతో రాసిన ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ కేంద్రమంత్రి అశోక్గజపతిరాజు, శాంతా బయోటిక్స్చైర్మన్వరప్రసాద్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్రంగంలో రాజు సాధించిన విజయాలు, కంపెనీ ఎదుగుదలకు ఆయన చేసిన కృషి గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. సాహిత్య, వాణిజ్యరంగాల్లో చేసిన సేవలకు గాను ఆయనకు లిమ్కా బుక్ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ వరల్డ్రికార్డ్లో స్థానం దక్కింది. కేంద్రం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది.