ఇటీవల ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీయేలో చేరిన బీహార్ జేడీయూ పార్టీ ఆ రాష్ట్రంలో సీట్ల కేటాయింపులు చేసుకుంది. లోక్ సభ ఎన్నికల సందర్భంగా మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా ఈరోజు బీజేపీ, జేడీయూ పార్టీల సీట్ల షేరింగ్ ను మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తావ్డే ప్రకటించారు.
మొత్తం బీహర్ లో 40 లోక్ సభ స్థానాలు ఉండగా 17 బీజేపీకి, 16 జేడీయూకి కేటాయించారు. 5 నియోజకవర్గాల్లో ఎల్జేపీ, హిందుస్తానీ అవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలు ఒక్కొక్క సీటు నుంచి పోటీ చేస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. హజిపూర్ లోక్సభ స్థానాన్ని చిరాగ్ పాశ్వాన్ పార్టీకి కేటాయించినట్లు వినోద్ తావ్డే చెప్పారు.