2038 నాటికి నెట్​– జీరో కార్బన్ ​టార్గెట్

2038 నాటికి నెట్​– జీరో కార్బన్ ​టార్గెట్

న్యూఢిల్లీ: 2038 నాటికి నెట్​ జీరో కార్బన్​ ఎమిషన్స్​ లెవెల్​కు చేరుకోవాలని టార్గెట్​గా పెట్టుకున్నామని, ఇందుకోసమే ఎనర్జీ ట్రాన్సిషన్​ ప్రాజెక్టులలో 2030 దాకా రూ. లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని ఓఎన్​జీసీ చైర్మన్​ అరుణ్​ కుమార్​ సింగ్​ సోమవారం వెల్లడించారు. ఆయిల్​ అండ్​ గ్యాస్​ ప్రొడక్షన్​లో దేశంలోనే ఓఎన్​జీసీ నెంబర్​1 గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ రంగ ఆయిల్​ అండ్​ గ్యాస్​ కంపెనీలు ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​ (ఐఓసీ), హిందుస్థాన్​ పెట్రోలియమ్​ కార్పొరేషన్​ (హెచ్​పీసీఎల్​), గ్యాస్​ అథారిటీ ఆఫ్​ ఇండియా లిమిటెడ్​ (గెయిల్​), భారత్​ పెట్రోలియమ్​ కార్పొరేషన్​ లిమిటెడ్​ (బీపీసీఎల్​)లు ఇప్పటికే నెట్​ జీరో ఎమిషన్స్​ కోసం ప్లాన్స్​ను ప్రకటించాయి.

ఇప్పుడు ఈ జాబితాలో ఆయిల్​ అండ్​ గ్యాస్​ కార్పొరేషన్​ లిమిటెడ్ (ఓన్​జీసీ) కూడా చేరింది. నెట్​ జీరో కార్బన్​ ఎమిషన్స్​ సాధించే దిశలో ఇంటర్నల్​గా చర్చలు జరిపి ప్లాన్స్​ రూపొందించుకున్నట్లు అరుణ్​ కుమార్​ సింగ్​ చెప్పారు. 2038 నాటికి దశలవారీగా తాము పెట్టుకున్న టార్గెట్స్​ను సాధించగలమనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. రెన్యువబుల్​ సోర్సెస్​ ద్వారా విద్యుత్​ ప్రొడక్షన్​ను ఇప్పుడున్న 189 మెగా వాట్ల నుంచి 1 గిగావాట్​కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్యాన్ని 2030 నాటికి అందుకుంటామని అన్నారు. రాజస్థాన్​లో 5 గిగావాట్ల ప్రాజెక్టు ఒకటి చూస్తున్నామని, ఇలాంటివే మరికొన్ని ప్రాజెక్టులనూ పరిశీలిస్తున్నామని  సింగ్​ వెల్లడించారు. ఆఫ్​షోర్​ విండ్​ఫార్మ్స్​ ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉందని చెప్పారు. పై  ప్రాజెక్టులన్నింటికీ  కలిపి రూ. లక్ష కోట్ల దాకా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

మంగుళూరు వద్ద ఏడాదికి మిలియన్​ టన్నుల కెపాసిటీ ఉండే గ్రీన్​ అమ్మోనియా ప్లాంట్​ను కూడా ఓఎన్​జీసీ ఏర్పాటు చేయనుంది. 2022–23 లో ఆయిల్​ అండ్​ గ్యాస్​ ప్రొడక్షన్​ను కంపెనీ పెంచుకోగలిగింది. ఈ అప్​ ట్రెండ్​ను కొనసాగించాలని కంపెనీ పనిచేస్తోంది. తూర్పు, పశ్చిమ తీరాలలోని ప్రాజెక్టులలో ప్రొడక్షన్​ పెంచుకోవడంతోపాటు, కొత్త ప్రాజెక్టులనూ చేపట్టడం వల్లే అప్​ట్రెండ్​ సాధ్యమవుతోంది. 14 డెవలప్​మెంట్​, 9 ఇన్​ఫ్రా ప్రాజెక్టులలో కలిపి మొత్తం రూ. 61,200 కోట్లను ఓఎన్​జీసీ పెట్టుబడులుగా పెడుతోంది.