
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అశ్వారావుపేట, మణుగూరు ఏరియా గవర్నమెంట్ హాస్పిటళ్లలో బ్లడ్ బ్యాంక్లకు అనుమతి వచ్చిందని డీసీహెచ్ఎస్ రవిబాబు మంగళవారం తెలిపారు. ఇప్పటి వరకు కేవలం కొత్తగూడెం, భద్రాచలం ఏరియా హాస్పటళ్లలో మాత్రమే బ్లడ్ బ్యాంకులున్నాయని, ఇప్పుడు కొత్తగా వీటితో మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకూ బ్లడ్ అందుబాటులో ఉండనుందని పేర్కొన్నారు.
గర్భిణులు, సికిల్ సెల్, అనీమియా, తలసేమియాతో పాటు యాక్సిడెంట్స్, ఇతరత్రా అత్యవసర సమయాల్లో రక్తం అవసరం ఉంటుందని తెలిపారు