న్యూజిలాండ్ తో మ్యాచ్... చిత్తుగా ఓడిన ఆసీస్

న్యూజిలాండ్ తో మ్యాచ్... చిత్తుగా ఓడిన ఆసీస్

సొంతగడ్డ పై జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే ఆస్ట్రేలియా ఘోర ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్ తో జరిగిన సూపర్‌ 12 మ్యాచ్ లో 89 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కివిస్ నిర్దేశించిన 201 పరుగులను ఛేజ్ చేసే క్రమంలో  కివీస్ బౌలర్ల ధాటికి ఆసీస్ 111 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (28),  డేవిడ్ వార్నర్ (5), ఆరోన్ ఫించ్ (13), మిచెల్ మార్ష్ (16), మార్కస్ స్టొయినిస్ (7), టిమ్ డేవిడ్ (11), మాథ్యూ వేడ్ (2), మిచెల్ స్టార్క్ (4), ఆడమ్ జంపా (0), జోష్ హాజిల్‌వుడ్ (1 నాటౌట్) పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ చెరో 3 వికెట్ల తీయగా, బౌల్ట్ 2 వికెట్లు, లోకీ ఫెర్గూసన్, ఐష్ సోధి చెరో వికెట్ పడగొట్టారు. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కాన్వే 92 పరుగులతో రాణించాడు. తొలి వికెట్‌కు అలెన్‌, కాన్వేలు 56 రన్స్‌ జోడించి మంచి ఆరంభాన్ని ఇచ్చారు.  కేవలం 3.5 ఓవర్లలోనే కివీస్‌ 50 పరుగుల మార్క్‌ను దాటింది. చివర్లో  జేమ్స్‌ నీషమ్‌ 13 బంతుల్లో 26  చేయడంతో కివిస్ జట్టు భారీ స్కోర్ చేసింది.